బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య
నెన్నెల, ఏప్రిల్ 9 : రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని, వారి కోసం దేశంలో ఎక్కడా లేనన్ని పథకాలు అమలు చేస్తున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పష్టం చేశారు. మండలంలోని జెండావెంకటాపూర్లో వైకుంఠధామం, డంప్యార్డులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. తెలంగాణ సర్కారు రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నదన్నారు. అయినా కొందరు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి వారికి ప్రజలు తగిన సమయంలో గుణపాఠం చెబుతారన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుల కోసం ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నారో చెప్పాలని ఆ పార్టీ నాయకులను ప్రశ్నించారు. అంతకుముందు గ్రామంలోకి వచ్చే రోడ్డు వద్ద తన సొంత నిధులతో తండ్రి రాజం స్మారకార్థకం కమాన్ నిర్మించగా, దానిని ప్రారంభించారు. ఎంపీపీ సంతోషం రమాదేవి, జడ్పీటీసీ సింగతి శ్యామల, ప్యాక్స్ చైర్మన్ మేకల మల్లేశ్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అశోక్గౌడ్, ఆత్మ చైర్మన్ సున్నం రాజు, సర్పంచ్లు యేస్కూరి లక్ష్మి, చీర్ల సత్తమ్మ, కామెర సుధ, ఎంపీటీసీలు ఓరం కమల, టీఆర్ఎస్ నాయకులు గడ్డం భీమాగౌడ్, సాగర్, మొండన్న, ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు.