హైదరాబాద్ : రాష్ట్రంలోని పలుచోట్ల రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు ఈదురుగాలులు, వడగండ్లతో వర్షాలు కురుసే అవకాశం ఉంది.
ఒకట్రెండు చోట్ల వడగండ్లతో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ధాన్యం ఎండబెట్టిన రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి