డిజిటిల్ మీడియా విభాగంలో కృషికి రెండోసారి
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా విభాగం డైరెక్టర్ దిలీప్ కొణతం పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అందించే చాణక్య అవార్డును అందుకున్నారు. శుక్రవారం గోవాలో జరిగిన 15వ గ్లోబల్ కమ్యూనికేషన్స్ కాంక్లేవ్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ అవార్డును ప్రదానంచేశారు. డిజిటల్ మీడియా విభాగంలో చేసిన కృషికి వరుసగా రెండోసారి దిలీప్కు ఈ గుర్తింపు లభించింది. 2020లో మొదటిసారి అందుకున్నారు. రెండు దశాబ్దాలుగా టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న ఆయన, టాటా డోనెల్లీ, అపోలో హెల్త్ స్ట్రీట్, సెంటర్ ఫర్ డాక్యుమెంటేషన్, రీసెర్చ్ అండ్ కమ్యూనికేషన్ అండ్ గూగుల్ వంటి ప్రతిష్ఠాత్మకమైన సంస్థల్లో విధులు నిర్వర్తించారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆయన సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత డిజిటల్ మీడియా డైరెక్టర్గా నియమించారు. తనకు రెండోసారి అవార్డు రావడం పట్ల దిలీప్ కొణతం సంతోషం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్కు, సహచర ఉద్యోగులకు ఈ సందర్భంగా దిలీప్ కృతజ్ఞతలు తెలియజేశారు.