హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): కరోనా నుంచి మీతోపాటు తోటివారిని కూడా కాపాడాలని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సూచించారు. మాస్క్ ధరించకపోతే రూ.1,000 జరిమానా తప్పదని హెచ్చరించారు. మంగళవారం ఒక్కరోజే 837 కేసులు నమోదుచేశామన్నారు. మాస్క్ ధరించనివారికి ఈ-చలాన్ను పంపిస్తున్నామని చెప్పారు. కారులో ప్రయాణిస్తూ మాస్క్ ధరించకపోతే, బైక్పై హెల్మెట్ పెట్టుకొని మాస్క్ ధరించకుండా ప్రయాణిస్తుంటే వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి చలాన్లను వాహనాల నంబర్ల ఆధారంగా ఇంటి కి పంపిస్తామని స్పష్టంచేశారు. వ్యాపారస్థులు, ఇతర సంస్థలు కచ్చితంగా ప్రభుత్వం జారీచేసిన జీవో 82ను పాటించాలని సూచించారు. శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించేవారు 200 మందికి మించి ఉండొద్దని తెలిపారు.