ఆదిలాబాద్ : చాకలి ఐలమ్మ పోరాట పటిమ, త్యాగం భావి తరాలకు స్ఫూర్తి దాయకమని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం ఐలమ్మ 126 వ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఐలమ్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతంగా సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం పరంగా నిర్వహిస్తున్నదన్నారు.
ప్రతి ఒక్కరు ఐలమ్మ ఆశయాలను ఆదర్శం గా తీసుకోవాలన్నారు. జిల్లాలో ముందుగా సోన్ గ్రామంలో ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేశారాని ఆ తర్వాత అంతటా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతున్నందున అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సి ఉంటుందన్నారు.
ధర్మసాగర్ చెరువు మినీ ట్యాంక్ బండ్ లా అభివృద్ధి అయిందని మిగతా చెరువులను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. పెరుగుతున్న జనాభా ననుసరించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్ఖడే, రాంబాబు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
వీరనారి చాకలి ఐలమ్మకు ఘన నివాళులు
నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే ఆటో షోకు విశేష స్పందన
Mahatma Gandhi University | ఎంసీఏ, ఎంబీఏ పరీక్షలు వాయిదా