ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు
హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)కి నాలుగు వారాల్లోగా చైర్మన్, సభ్యులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఉద్యోగాల భర్తీలో టీఎస్పీఎస్సీ ఎంతో కీలకపాత్ర పోషిస్తుందని, ఆ పనులు జాప్యం చేయవద్దని హితవు చెప్పింది. టీఎస్పీఎస్సీలో చైర్మన్, సభ్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంటూ కరీంనగర్ జిల్లాకు చెందిన నిరుద్యోగి జే శంకర్ దాఖలుచేసిన ప్రజాహిత వ్యాజ్యంపై గురువారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ అంశంపై విచారణను కోర్టు జూన్ 17కు వాయిదా వేసింది.