హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న గోదాములను ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేలు తెలిపారు. తద్వారా కొత్తగా 3.15 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటికే సుమారు 3 లక్షల టన్నుల సామర్థ్యంగల గోదాములుండగా.. మరో 3.15 లక్షల టన్నుల సామ ర్థ్యం గల 28 గోదాములను నిర్మిస్తున్నట్టు తెలిపారు. తద్వారా గోదాముల సామర్థ్యం 6.15 లక్షల టన్నులకు చేరుకుంటుందని చెప్పారు. ఎంపీ సంతోష్కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా గోదాముల్లో మొక్క లు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.