సిటీ క్రిమినల్ కోర్టు నాంపల్లి: తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులుగా ఉద్యమ న్యాయవాదులు సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలిని నియమించడం పట్ల సీఎం కేసీఆర్కు తెలంగాణ న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి ఉండి ఆయన పిలుపు మేరకు స్వరాష్ట్రం కోసం పోరాటం చేసిన న్యాయవాదులకు తగిన గుర్తింపు దక్కిందని పేర్కొన్నారు. కృతజ్ఞతలు తెలిపినవారిలో నాంపల్లి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మధుశేఖర్, జాయింట్ సెక్రటరీ జక్కుల లక్ష్మణ్, సిటీ సివిల్ కోర్టు ప్రెసిడెంట్ లింగం నారాయణ, రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రెసిడెంట్ టీ భాస్కర్రెడ్డి, సికింద్రాబాద్ కోర్టు బార్ ప్రెసిడెంట్ టీఎస్ శ్రీకాంత్, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, బార్కౌన్సిల్ సభ్యుడు, ఫుడ్ కమిషన్ సభ్యుడు కాంతం గోవర్ధన్, ట్రిబ్యునల్ మెంబర్ గోవర్ధన్రెడ్డి, హైకోర్టు ప్రధాన కార్యదర్శి కళ్యాణ్రావు, తెలంగాణ జాగృతి లీగల్ సెల్ కన్వీనర్ ఏ తిరుపతి వర్మ, టీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు ఉన్నారు.