యాంటిగ్వా: శ్రీలంకతో జరిగిన రెండవ వన్డే మ్యాచ్లో వెస్టిండీస్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ మరో రెండు బంతులు ఉండగా విక్టరీని సొంతం చేసుకున్నది. దీంతో 2-0 తేడాతో వన్డే సిరీస్లో ఆధిపత్యం నెలకొల్పింది. విండీస్ ఓపెనర్లు షాయ్ హోప్, ఎవిన్ లూయిస్లు తొలి వికెట్కు 192 పరుగుల భాగస్వామ్యం ఏర్పరిచారు. అయితే చివల్లో నికోలస్ పూరన్ మెరుపు ఇన్నింగ్స్తో విండీస్ విక్టరీ సులువైంది. శ్రీలంక ఇన్నింగ్స్లో దనుష్క గుణతిలక 96, దినేశ్ చండీమాల్ 71 రన్స్ చేశారు. విండీస్ ఇన్నింగ్స్లో ఎవిన్ లూయిస్ 103 రన్స్ చేశాడు. హోప్ 84 రన్స్ చేశాడు.