హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం శ్రీశైలానికి రానున్నారు. రేపు ఉదయం 9 గంటలకు అమిత్ షా దిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరనున్నారు. ఉదయం 11.15 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్ షా అనంతరం ఇక్కడికి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12.25కు సున్నిపెంటకు చేరుకున్నారు. మధ్యాహ్నం 12.45 నుంచి 1.45 వరకు శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల దర్శనం చేసుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు దేవస్థానం భ్రమరాంబ అతిథిగృహంలో భోజనం చేయనున్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు శ్రీశైలం నుంచి హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3.50 గంటలకు హైదరాబాద్ నుంచి దిల్లీకి పయనమవనున్నారు.