న్యూఢిల్లీ, జూన్ 18: యమహా మోటర్ ఇండియా దేశీయ విపణికి తమ ఎఫ్జెడ్ శ్రేణిలో మరో సరికొత్త ద్విచక్ర వాహనాన్ని పరిచయం చేసింది. ఎఫ్జెడ్-ఎక్స్ పేరుతో శుక్రవారం విడుదలైన ఈ బైక్ ప్రారంభ ధర ఢిల్లీ ఎక్స్షోరూం ప్రకారం రూ.1,16,800 (బ్లూటూత్ లేనిది)లుగా ఉన్నది. గరిష్ఠ ధర రూ.1,19,800 (బ్లూటూత్ ఉన్నది). భారత్లో యమహాకు ఇదే తొలి నియో-రెట్రో మోటర్సైకిల్ కావడం విశేషం. ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, 149సీసీ ఇంజిన్తో దీన్ని రూపొందించారు. ఇదిలావుంటే తమ స్కూటర్ మోడల్లో కొత్తగా ఫాసినో 125 హైబ్రిడ్ వేరియంట్నూ యమహా ఈ సందర్భంగా ఆవిష్కరించింది. సాంకేతికంగా దీన్ని మరింతగా అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నది.