తగ్గనున్న పెట్రో ధరలు!
పశ్చిమబెంగాల్ రెండో విడుత పోలింగ్ నేపథ్యంలో నిర్ణయం
న్యూఢిల్లీ, మార్చి 31: వంటగ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్ ధరను గత నెలలో రూ.125 పెంచిన ప్రభుత్వ చమురు సంస్థలు.. రూ.10 తగ్గిస్తున్నట్టు బుధవారం ప్రకటించాయి. గురువారం నుంచి ఈ తగ్గింపు అమలులోకి వస్తుంది. ఇప్పటి వరకు రూ.819 ఉన్న సిలిండర్ ధర రూ.809 అవుతుంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం జరుగనున్న రెండో దశ పోలింగ్కు ఒక రోజు ముందు వంటగ్యాస్ ధర తగ్గింపు ప్రకటన చేయడం గమనార్హం. మరోవైపు, గత ఏడాది నవంబర్ నుంచి పెరుగుతూ వచ్చిన ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు మార్చి మూడో వారం నుంచి తగ్గడం మొదలైందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక ప్రకటనలతో తెలిపింది. ఇటీవల రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు కూడా త్వరలో తగ్గవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి:
గే న్యాయవాది.. హైకోర్టు జడ్జిగా ఉండొద్దా?
పాన్-ఆధార్ అనుసంధానం గడువు 3 నెలలు పొడిగింపు