మొత్తం 14 మంది సీనియర్ ఐపీఎస్లకు పదోన్నతి కల్పిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం
హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా 14 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు కేంద్ర సర్వీసుల్లో అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) లేదా తత్సమాన హోదాను కల్పిస్తూ కేంద్ర క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ తీర్మానించింది. తెలంగాణ క్యాడర్కు చెందిన 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్, 1992 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి జితేందర్ పదోన్నతులు పొందిన జాబితాలో ఉన్నారు. సీవీ ఆనంద్ ప్రస్తుతం కేంద్ర డిప్యూటేషన్లో నిసా డైరెక్టర్గా హైదరాబాద్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. మరో సీనియర్ అధికారి జితేందర్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర శాంతిభద్రతల అడిషనల్ డీజీగా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ నుంచి 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి నళిని ప్రభాత్ సైతం కేంద్రంలో అడిషనల్ డీజీగా పదోన్నతి పొందినవారిలో ఉన్నారు.