కొత్తూరు, ఏప్రిల్ 7: కొత్తూరు మున్సిపాలిటీకి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గులాబీ జెండా ఎగురవేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం కొత్తూరు మున్సిపాలిటీకి చెందిన వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పాపరస్ పోర్టులో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ కృషి చేసిందన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మున్సిపాలిటీలో టీఆర్ఎస్ గెలువడం ఖాయమన్నారు. టీడీపీ నాయకులు పీర్లగూడెం మహేశ్గౌడ్, పీర్లగూడెం సత్యంగౌడ్, కుమ్మరి రవి, బండారు లక్ష్మీనారాయణ, ఎదిర రాజు గణేశ్గౌడ్ టీఆర్ఎస్లో చేరారు.
కొత్తూరు మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
కొత్తూరు/కొత్తూరు రూరల్: కొత్తూరు మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో కలిసి మంత్రి శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సకల హంగులతో కొత్తూరు మున్సిపాలిటీని తీర్చిదిద్దుతామన్నారు. ప్రతివార్డులో పార్కు ఏర్పాటు చేసి అందంగా ముస్తాబు చేస్తామన్నారు.
సెట్విన్ లాంటి సంస్థను ఏర్పాటు చేస్తాం
కొత్తూరు పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నందున స్టీల్ డెవలప్మెంట్ కోర్సులు అవసరం ఉందని మంత్రి శ్రీనివాస్గౌడ్ అభిప్రాయపడ్డారు. అందుకోసం సెట్విన్లాంటి స్కిల్ డెవలప్మెంట్ సంస్థను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. పరిశ్రమలో అవకాశాలు కూడా ప్రభుత్వం తరుఫున కల్పిస్తామని ఆయన వివరించారు.
కార్యాలయం భవన నిర్మాణానికి స్థల పరిశీలన
పాపరస్ పోర్ట్ సమీపంలో ఉన్న స్థలాన్ని మున్సిపాలిటీ కార్యాలయం నిర్మాణం కోసం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో కలిసి మంత్రి శ్రీనివాస్గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులతో మాట్లాడి స్థలం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు ఎకరాల స్థలంలో అన్ని హంగులతో కొత్త మున్సిపాలిటీ భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. అంతకుముందు తిమ్మాపూర్ పరిధిలో ఓ వివాహానికి మంత్రి హాజరయ్యారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్ రాంబాల్నాయక్, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ మధుసూదన్రెడ్డి, నాయకులు ఎమ్మె సత్యనారాయణ , టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాదగిరి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, అధికారులు మున్సిపల్ కమిషనర్ వీరేందర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, రామ్రెడ్డి, టీపీవో శ్రీధర్, మున్సిపల్ ఏఈ హరీశ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కవిత, మేనేజర్ మంజులత, నాయకులు జనార్దనచారి, రవినాయక్, గోపాల్నాయక్, మాజీ ఎంపీటీసీ దేవేందర్యాదవ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కృష్ణయ్యయాదవ్ పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ..
కేసీఆర్ తాత అభివృద్ధి ప్రదాత
మాస్కుల్లేని 90 మందికి జరిమానా
ధోనీ నుంచి జెర్సీ అందుకున్న పుజారా