వరంగల్ అర్బన్ : సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీలకు నెలకు రూ.300 కోట్లు ఇస్తున్నాడు. కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వడం లేదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ విమర్శించారు. కమలాపూర్ మండలం ఉప్పల్లో మంత్రి ఎర్రబెల్లి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పల్లె ప్రగతిలో భాగంగా పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, వైకుంఠధామాలు గ్రామాల్లో నిర్మించామన్నారు.
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం 8 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధి సీఎం కేసీఆర్ చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాల పనితీరుపై కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పై ప్రజలు చర్చచేయాలన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో రూ. 500 పెన్షన్ ఇస్తే తెలంగాణలో రూ.2000 వేలు పెన్షన్ ఇస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో పదేళ్లుగా బిజెపి పాలిస్తుంది రైతులకు పెట్టుబడి కోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలు అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. రెండోసారి ప్రధానమంత్రి అయితే నల్ల ధనం వెలికితీత, జన్ ధన్ ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తానని, ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తానని అని మోదీ చేసిన హామీల విఫలం ప్రజలు చర్చించాలన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ నాలుగు వేల ఇండ్లు మంజూరు చేస్తే ఒక్క ఇల్లు కూడా కట్టియ్యలేదని ఈటలను విమర్శించారు. కేసీఆర్ పేరు చెప్పుకొని ఆస్తులు సంపాదించుకున్నాడని దుయ్యబట్టారు.