వనపర్తి, ఏప్రిల్ 7: వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో ఆస్తి పన్ను వసూలుపై అధికారులు, రెవెన్యూ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హైదరాబాద్ మున్సిపాలిటీ ప్రాంతీయ సంచాలకులు శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన వనపర్తి మున్సిపాలిటీని అకస్మికంగా తనిఖీ చేయడంతోపాటు కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. ఆస్తి పన్ను వసూలుపై రెవెన్యూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం కమిషనర్ చాంబర్లో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్ ఆయనను శాలువాతో సన్మానించి పలు సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, మేనేజర్ మహ్మద్ఖాజా తదితరులు పాల్గొన్నారు.