కోటపల్లి, మార్చి 30 : మాస్కు లేకుండా తిరిగితే రూ.1000 జరిమానా తప్పదని చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజు హెచ్చరించా రు. పారుపల్లి గ్రామ సమీపంలోని జాతీ య రహదారి పై సీఐ, ఎస్ఐ రవి కుమార్ ఆధ్వర్యంలో వాహనదారులకు మాస్క్లను పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ను ధరించాలని సూచించారు. అత్యవసర పనులు ఉన్న వారు మాత్రమే బయటకు రావాలని సీఐ సూచించారు. ట్రైనీ ఎస్ఐ కుమార్, హెడ్ కానిస్టేబుల్ ఆమ్టే నరేశ్ పాల్గొన్నారు.
తాండూర్, మార్చి 30 : తాండూర్ ఐబీ కేంద్రంలో జాతీయ రహదారిపై వాహన దారులకు కరో నా నిబంధనలపై ఎస్ఐ శేఖర్రెడ్డి అవగాహన కల్పించారు. అనంతరం మాస్కులు లేని వారికి మాస్కులను అందజేశారు. శిక్షణ ఎస్ఐ మహేశ్, పోలీసు సిబ్బం ది, స్థానిక నాయకులు, వాహనదారులు ఉన్నారు. మాదారంలో ఎస్ఐ మానస సైతం అవగాహన కల్పించారు.
కన్నెపల్లి, మార్చి 30 : కొవిడ్ నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని భీమిని ఎస్ఐ కొమురయ్య పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూ చించారు. ఎలాంటి కార్యక్రమాలను అనుమ తించమని తెలిపారు.
మందమర్రి, మార్చి 30 : మాస్కులు ధరించని వారిపై చర్యలు తీసుకుంటామని మందమర్రి ఎస్ఐ ఎల్ భూమేశ్ తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాస్కులు ధరించకుండా విచ్చల విడిగా తిరిగే వారికి జరిమానా విధిస్తామన్నారు.
లక్షెట్టిపేట రూరల్, మార్చి 30 : ప్రతి ఒక్క రూ భౌతిక దూరం పాటించాలని లక్షెట్టిపేట ఎస్ఐ దత్తాద్రి పేర్కొన్నారు. మాస్కు లేకుం డా తిరిగితే చర్యలు తీసు కుంటామన్నారు.
సీసీసీ నస్పూర్, మార్చి 30 : ప్రతి ఒక్కరూమాస్కులు ధరించాలని సీసీసీ నస్పూర్ ఎస్ఐ శ్రీనివాస్ సూచించారు. ఆయన గోదావరికాలనీ(షిర్కె) చౌరస్తాలో కరోనా ఉధృతిపై ఆటోడ్రైవర్లు, చిరువ్యాపారులు, స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. మాస్కు లు లేనిదే బయటకు రావద్దని, శానిటైజర్లు దగ్గరపెట్టుకోవాలని సూచించారు. ఏఎస్ఐ సత్తయ్య, ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.