నేటి నుంచి విద్యాశాఖ అధికారులకు ప్రత్యేక శిక్షణ
ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్లకూ అవగాహన
మహబూబ్నగర్టౌన్, ఏప్రిల్ 25: ప్రభుత్వ బడులను బలోపేతం చేసే దిశగా విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. కొవిడ్ నేపథ్యంలో వర్చువల్ మోడ్లో ఎస్ఎంసీ (స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ), ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వీటిని నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి మౌలిక వసతులు కల్పించేలా అవగాహన కల్పించనున్నారు.
విద్యా శాఖ శిక్షణ ఇలా..
ఈనెల 26న జిల్లా స్థాయిలో అన్ని మండలాల ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం, ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం,ఎస్ఎంసీ చైర్మన్, టీచర్, సీఆర్పీ, ఐఈఆర్పీలకు ప్రతి మండల నుంచి శిక్షణ ఇవ్వడం ద్వారా రిసోర్స్ పర్సన్లను తయారు చేస్తున్నారు.
ఈనెల 27న మండలస్థాయిలో హెచ్ఎంలు, సీఆర్పీలు, ఐఈఆర్పీ, టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఈనెల 30న పాఠశాల స్థాయిలో శిక్షణ ఉంటుంది. శిక్షణలో ఆ పాఠశాలల్లోని అందరు ఉపాధ్యాయులు, సర్పంచ్, ఎస్ఎంసీ చైర్మన్, సభ్యులు, ఎంపీటీసీ, వార్డు సభ్యులు పాల్గొంటారు.
వివిధ అంశాలపై అవగాహన
విద్యాహక్కు చట్టం,ఎస్ఎంసీ,ఎన్ఈపీ-2020
పాఠశాల నిర్వహణలో ఎస్ఎంసీల పాత్ర
పాఠశాల అభివృద్దికి ప్రణాళికలు ఎస్ఎంసీ సమావేశాలు
బాలికల హక్కులు, బాలికల విద్య, పీవోఎస్వోయాక్టు, ఎస్ఎంసీల పాత్ర
మధ్యాహ్న భోజనం, వాష్ కార్యక్రమం, హరితహారం, స్వచ్ఛపాఠశాల అమలులో ఎస్ఎంసీల పాత్ర, స్వీయ మూల్యాంకనం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు.