వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 9 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అందువల్ల కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు రైతులు పండించిన పత్తికి అధిక ధర వచ్చే విధంగా చూడాలని అధికారులను కోరారు. హన్మకొండలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో బుధవారం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ అమరనాథ్ రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, ఇతర అధికారులు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పత్తి క్వింటాల్కు కనీస మద్దతు ధర 6025 రూపాయలుగా నిర్ణయించిందన్నారు.
నిర్ణయించిన మద్దతు ధర కన్నా ఎక్కువ ధరకు రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసే విధంగా చూడాలని అయన అధికారులను కోరారు. వరంగల్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయ వసతి కోసం రాష్ట్ర ప్రభుత్వం భవనాన్ని కేటాయిస్తామని ఈ సందర్భంగా సీసీఐ అధికారులకు మంత్రి హామీ ఇచ్చారు.
సీసీఐ వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ బ్రాంచీల ద్వారా గత ఆర్ధిక సంవత్సరంలో 29 జిల్లాలలోని 112 కేంద్రాల ద్వారా 7 లక్షల 99 వేల 340 రైతుల నుంచి రూ.కోటి 78 లక్షల 90 వేల విలువైన 264 క్వింటాళ్ల పత్తిని సేకరించింది. 10167 కోట్ల 71 , 2 394 రూపాయలను చెల్లించినట్లు సీసీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ అమరనాథ్ రెడ్డి తెలిపారు. సీసీఐ కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వ భవనాన్ని కేటాయించినందుకు సీసీఐ అధికారులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచారయత్నం కేసు
దారుణం : రైల్వే ట్రాక్పై యువతి మృతదేహం
Road accident |బొలెరో వాహనం బోల్తా..పది మందికి గాయాలు