కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 24: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బోర్నపల్లికి చెందిన ముదిరాజ్, యాదవ సంఘాల నాయకులు టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించా రు. గురువారం వారు కరీంనగర్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ను కలిసి మద్దతు లేఖ అందించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మసడి స్వరూపాసమ్మారావు, రవీందర్, అనిల్, రమేశ్, అజయ్ మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న టీఆర్ఎస్ సర్కారు వెంటే ఉంటామని స్పష్టం చేశారు. తమ సమస్యల పరిష్కారం విషయంలో ఈటల రాజేందర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు ఆరోపించారు. వచ్చే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా అండగా నిలుస్తామని చెప్పారు.
టీఆర్ఎస్లోకి యూత్ కాంగ్రెస్ నేతలు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తున్నది. ఇతర పార్టీల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు పెద్దసంఖ్యలో గులాబీ గూటికి చేరుతున్నారు. తాజాగా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లిలో 50మంది యూత్ కాంగ్రెస్ నాయకులు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కారుతోనే యువతకు న్యాయం జరుగుతుందన్నారు.