హన్మకొండ చౌరస్తా, మే 18: సీటీ స్కాన్కు అధిక మొత్తం వసూలు చేస్తున్న వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ చౌరస్తాలోని విజయ డయాగ్నస్టిక్ సెంటర్పై కేసు నమోదైంది. మంగళవారం చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ టాస్క్ఫోర్స్ కమిటీసభ్యులు డీఎంహెచ్వో డాక్టర్ లలితాయాదవ్, ఏసీపీ జితేందర్రెడ్డి తదితరులతో కలిసి పలు డయాగ్నస్టిక్ సెంటర్లను తనిఖీ చేశారు. విజయ డయాగ్నస్టిక్స్ సెంటర్లో సీటీ స్కాన్కు రూ.5,700 వసూలు చేస్తుండటంతో ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్వాహకులపై టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులు కేసు నమోదుచేశారు.