ఫర్టిలైజర్సిటీ, 27: సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను కించపరిచేలా, కులాల మధ్య వైషమ్యాలు సృష్టించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పవర్హౌస్ కాలనీకి చెందిన మేడిపల్లి ఓసీపీలో ఈపీ ఆపరేటర్గా పనిచేస్తున్న పున్నం రాంచందర్గా గుర్తించి కేసు నమో దుచేసినట్టు పేర్కొన్నారు. సోషల్మీడియా ఖాతా లపై నిఘా ఉంటుందని, తప్పుడు సమాచారం షేర్ చేసి కష్టాల్లో పడొద్దని సూచించారు.