హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): సరూర్నగర్లోని విక్టోరియా మెమోరియల్ హోమ్లో కొవిడ్ బారిన పడిన 16 మంది పిల్లలకు ఏలోటు రాకుండా చూడాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. సోమవారం వర్చువల్ పద్ధతిలో మంత్రి ఆ పిల్లలను పరామర్శించారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థులను ఆప్యాయంగా పలకరించివారికి ధైర్యంచెప్పారు. విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుతూ ఎప్పటికప్పుడు ఆక్సిజన్ లెవల్స్, టెంపరేచర్ను పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. అవసరమైతే అంబులెన్స్ను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
ప్రజల రక్షణ కోసమే లాక్డౌన్
ప్రజల ప్రాణాల కన్నా ఏదీ ముఖ్యం కాదని భావించడం వల్లనే సీఎం కేసీఆర్ లాక్డౌన్ విధించారని, దీన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని మంత్రి కొప్పుల అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన హైదరాబాద్లోని తన నివాసం నుంచి జగిత్యాల జిల్లా అధికారులతో వర్చువల్గా సమావేశమయ్యారు. కరోనా లక్షణాలున్నవారికి పరీక్షలు నిర్వహించి, మందులు ఇవ్వాలని ఆదేశించారు.