న్యూఢిల్లీ : ఒలింపిక్స్ రెజ్లింగ్ పతక విజేత సుశీల్ కుమార్పై హత్య కేసు నమోదైంది. ఆయన కోసం ఢిల్లీ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. జూనియర్ జాతీయ మాజీ ఛాంపియన్ను హత్య చేసినట్లు సుశీల్ కుమార్పై ఆరోపణలు ఉన్నాయి. మంగళవారం రాత్రి ఛత్రసాల్ స్టేడియంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు దారుణహత్యకు గురయ్యారు. జూనియర్ జాతీయ మాజీ ఛాంపియన్ సాగర్ను హత్య చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు సీనియర్ రెజ్లర్ సుశీల్ కుమార్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
ఢిల్లీలోని మోడల్ టౌన్ ప్రాంతంలో ఉన్న ఛత్రసల్ స్టేడియంలో ఆస్తి వివాదంపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు సాక్షులు చెప్తున్నారు. సాగర్, అతడి స్నేహితులు నివసించిన ఇంటిని ఖాళీ చేయమని సుశీల్ వారిపై ఒత్తిడి తెచ్చాడు. స్టేడియం లోపల రెజ్లర్ల రెండు గ్రూపులు ఒకరితో ఒకరు ఘర్షణపడ్డారు. ఈ ఘర్షణలో ఐదుగురు రెజ్లర్లు గాయపడగా.. వీరిలో సాగర్ (23) దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు. అతను ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కుమారుడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, స్టేడియం పార్కింగ్ ప్రాంతంలో రాత్రి 1.15 – 1.30 మధ్య ఈ ఘర్షణ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరేసరికి సాగర్తోపాటు మరో నలుగురు తీవ్రగాయాలపాలై పడిఉన్నారు. వీరిని పోలీసులు సమీపంలోని దవాఖానకు తరలించి చికిత్స ఇప్పించారు. గాయపడిన వారిలో సాగర్ (37), అమిత్ కుమార్ (27), మరో ఇద్దరు రెజ్లర్లు ఉన్నారు.
ఘటనా స్థలం నుంచి పోలీసులు 5 వాహనాలతోపాటు డబుల్ బారెల్ గన్, 3 లైవ్ క్యాట్రిడ్జ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుశీల్ కుమార్పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున ఆయన పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ప్రిన్స్ దలాల్ తోపాటు మరో ఇద్దరు రెజ్లర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఒలంపిక్ రెజ్లర్ సుశీల్ కుమార్ తెలిపారు. చనిపోయిన వ్యక్తిగా చెప్తున్న సాగర్ తమ తోటి మల్లయోధుడు కాదని చెప్పారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మా ప్రాంగణంలోకి వచ్చి గొడవ చేస్తున్నారని మేమే పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. ఈ సంఘటనతో మా స్టేడియానికి ఎటువంటి సంబంధం లేదన్నారు.
కరెనా ఎఫెక్ట్ : విదేశాల్లో పెరిగిన భారతీయ విద్యార్థుల ఇబ్బందులు
కరోనాతో నటి అభిలాషా పాటిల్ కన్నుమూత
మే 15 వరకు బీహెచ్యూ మూసివేత.. జూన్ 30 వరకు పరీక్షలు రద్దు
ఒకే కాన్పులో 9 మంది జననం.. మాలిలో ఘటన
నియంత్రణ కోల్పోయిన చైనా రాకెట్.. ఎక్కడ కూలుతుందోనని ఆందోళన
భారత ప్రయాణికులపై శ్రీలంక నిషేధం
కేరళలో 8 రోజులు సంపూర్ణ లాక్డౌన్
మంగళసూత్రం ధరించిన వరుడు.. మరి నెలసరి అవుతున్నాడా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..