హైదరాబాద్ : ప్రయాణికులతో వెళ్తున్న కారు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు వచ్చి మంటలు అంటుకున్నాయి. నగరంలోని సైఫాబాద్ స్టేషన్ పరిధిలో తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. స్పందించిన డ్రైవర్ కారును నిలిపి అందులోని ఇద్దరిని కిందకు దించడంతో ప్రమాదం తప్పింది. సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కారు డ్రైవర్ సకాలంలో స్పందించడంతో పెనుప్రమాదం తప్పింది. ఇంజిన్లో సాంకేతిక లోపం కారణంగానే మంటలు వ్యాపించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఊహించిన ప్రమాదంతో సమీపంలోని వాహనదారులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు.