ఆగ్రా: నపుంసకులతో స్నేహం చేసినందుకు ఓ యువకుడికి చెప్పుకోలేని ప్రమాదం వచ్చిపడింది. యువకుడితో గొడవపడ్డ నపుంసకులు అతని పురుషాంగాన్ని కోసేసి పారిపోయారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా నగరంలో రెండు రోజుల క్రితం ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆగ్రా పట్టణానికి చెందిన ఓ 24 ఏండ్ల యువకుడు తరచూ గుడీ, రాజీ అనే ఇద్దరు నపుంసకులతో కలిసి తిరిగేవాడు. వాళ్లతో కలిసి ఎప్పుడూ పెండ్లిళ్లు, ఇతర శుభకార్యాల సందర్భంగా డ్యాన్సులు చేసేందుకు వెళ్తుండేవాడు.
ఎప్పటిలాగే గత బుధవారం రాత్రి కూడా సదరు యువకుడు గుడీ, రాజీలతో కలిసి ఓ పెండ్లి ఊరేగింపులో డ్యాన్సు చేసేందుకు వెళ్లాడు. అక్కడ డబ్బుల విషయంలో నపుంసకులకు, యువకుడికి మధ్య గొడవ జరుగడంతో ఇద్దరు కలిసి యువకుడి మర్మాంగాన్ని కోసేసి పారిపోయారు. తీవ్ర రక్త స్రావం కావడంతో భయపడిపోయిన బాధితుడు తన సోదరికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు.
వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న యువకుడి సోదరి అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. చికిత్స అనంతరం సోదరుడిని వెంటబెట్టుకెళ్లి ఢిల్లీ గేట్ పోలీస్స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. పారిపోయిన నిందితుల కోసం గాలిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తెలుగు ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని ఉగాది శుభాకాంక్షలు
దేశంలో కరోనా విలయం.. కొత్తగా 1.61లక్షల కేసులు
‘స్పుత్నిక్ వి’కి డీసీజీఐ గ్రీన్సిగ్నల్
రెండు కాళ్లు, మూడు చేతులతో.. ఒడిశాలో జన్మించిన అవిభక్త కవలలు
రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు
ఎఫ్ 3 చిత్రంలో వకీల్ సాబ్ బ్యూటీ..!