కంటోన్మెంట్, మార్చి 9 : దేశంలో ఇంధనపు ధరలను గాలికొదిలేసి.. ప్రభుత్వ కంపెనీలను ప్రైవేట్ పరం చేసు న్న మోదీ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లడిగే నైతిక హక్కు లేదని ఎమ్మెల్యేలు సాయన్న, రసమయి బాలకిషన్లు స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మడ్ఫోర్ట్ ప్రభుత్వ పాఠశాల, బోయిన్పల్లిలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలోని ఉపాధ్యాయులను టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డితో కలిసి వాణీదేవికి మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థి సురభివాణీదేవికి కంటోన్మెంట్లో అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే గర్వకారణమని కేంద్ర మంత్రులు ప్రశంసిస్తున్నారని గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్లు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులను తప్పుడు ప్రచారాలతో రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి మొద టి ప్రాధాన్యతగా ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, లోక్నాథం, ప్రభాకర్, నళినికిరణ్, నివేదిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మారేడ్పల్లి : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మె ల్యే రసమయి బాలకిషన్, స్థానిక ఎమ్మెల్యే సాయన్నలు అన్నారు. మంగళవారం మారేడ్పల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మె ల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి మద్దతుగా ఎమ్మెల్యేలు సాయన్న, రసమయి బాలకిషన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సం క్షేమ పథకాలు, అభివృద్ధి పనులను పట్టభద్రులకు వివరిస్తూ.. వాణీదేవిని అత్యధిక మెజార్టీతో గెలిపించా లని కోరారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలు అన్ని రంగాల ప్రజలను ఆకర్షించాయని తెలిపారు.
ఉద్యోగులు, పట్టభద్రులు, మేధావులు టీఆర్ఎస్ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. మహిళ అభ్యర్థి వాణీదేవిని గెలిపిస్తే మహిళా పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని తెలిపారు. అదే విధంగా విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలతో పాటు విద్యార్థుల ఇబ్బందులు తెలిసిన వ్యక్తి శాసన మండలిలో ఉంటే వారి పక్షనా ఆమె గొంతు వినిపించే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, కంటోన్మెంట్ మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సంతోశ్యాదవ్, పిట్ల నాగేశ్ముదిరాజ్, పనస సంతోశ్ పాల్గొన్నారు.
మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లోని హిల్స్ట్రీట్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికి మద్దతుగా సికింద్రాబాద్ నియోజకవర్గం పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను పట్టభద్రులకు వివరిస్తూ టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వాణీదేవికి ఓటు వేసి అత్యధిక మేజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, నాయకులు హరి పాల్గొన్నారు.
బొల్లారం : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవిని గెలిపించాలని కోరుతూ మంగళవారం తిరుమలగిరిలోని పలు కాలనీల్లో మాజీ బోర్డు సభ్యుడు శ్యామ్కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ కరపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో రాజిరెడ్డి, విజయ్, రాజు, రామ్, నందు పాల్గొన్నారు.