శ్రీవారి దర్శనం.. స్థానికులకే

- ఇతర ప్రాంతాల భక్తులకు అనుమతి రద్దు
- ఈ నెల 25 నుంచి జనవరి 3 వరకు ఆంక్షలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వైకుంఠ ఏకాదశికి ఇతర ప్రాంతాల భక్తులను అనుమతించబోమని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. కరోనా నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని వివరించింది. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరిగే ఈ నెల 25వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు రోజుకు 10వేల మంది స్థానికులకు మాత్రమే స్వామి దర్శనానికి టోకెన్లు జారీ చేస్తామని తెలిపింది. ఇప్పటికే ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులను రోజుకు 20వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని చెప్పింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమలలో మంగళవారం కోయిల్ అళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం సినీనటుడు సాయిధరమ్ తేజ్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా.. ఆలయ ప్రాంగణంలో పాము కనిపించడంతో భక్తులు హడలెత్తిపోయారు. ఆలయ సిబ్బంది అప్రమత్తమై దానిని పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేశారు.
తాజావార్తలు
- చిక్కుల్లో విరాట్ కోహ్లి.. కేరళ హైకోర్టు నోటీసులు
- ఛత్తీస్గఢ్లో 24 మంది నక్సలైట్ల లొంగుబాటు
- స్నానాల గదుల్లోకి దూరి.. యువతుల లోదుస్తులు చించి..
- వేటగాళ్ల ఉచ్చుకు పులి మృత్యువాత
- ఆన్లైన్ క్లాస్లో టీచర్ను బురుడీ కొట్టించిన స్టూడెంట్
- ఆచార్యకు స్టార్ హీరో వాయిస్ ఓవర్..!
- హెచ్1-బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు గుడ్న్యూస్
- ఆ ఆరోపణలు క్రేజీగా ఉన్నాయి: బిల్ గేట్స్
- ప్రియురాలితో గొడవపడి సముద్రంలో దూకిన యువకుడు
- పల్లె ప్రకృతివనం, ట్రాఫిక్ సిగ్నల్స్ను ప్రారంభించిన మంత్రి