దళితబంధు పథకం అమలు మార్గదర్శకాలు విడుదల
హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. పథకం కింద లబ్ధిదారులు ఒకటి లేదా రెండు వ్యాపారాలను చేసుకొనే అవకాశం కల్పించింది. లబ్ధిదారులు బృందంగా ఏర్పడి వ్యాపార యూనిట్ను ప్రారంభించుకొనే వెసులుబాటు ఇచ్చింది. ఈ మేరకు పథకం అమలుపై ఎస్సీ కులాల అభివృద్ధిశాఖ కార్యద ర్శి రాహుల్బొజ్జా శనివారం మార్గదర్శకాలు జారీచేశారు.