హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వీ సునీతాలక్ష్మారెడ్డికి ప్రభుత్వం క్యాబినెట్ హోదా కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర స్త్రీ, శిశు, వయోవృద్ధులశాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యాదేవరాజన్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. చైర్పర్సన్గా ఆమె బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి ఐదేండ్లపాటు పదవిలో కొనసాగుతారని తెలిపారు. రాష్ట్ర మంత్రికి లభించే అన్ని సౌకర్యాలు, జీతభత్యాలు ఆమెకు వర్తిస్తాయని పేర్కొన్నారు.