హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): కరోనా నుంచి గిరిజనులను కాపాడేందుకు ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ లేఖ రాశారు. కంటికి కనిపించని కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే ప్రధాన అస్త్రమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో మన దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నదని పేర్కొన్నారు.