హైదరాబాద్: నగరంలోని ఎల్బీ నగర్లో వ్యాపారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఎల్బీనగర్లోని కైఫ్ ట్రేడర్స్ ఉడ్ యజమాని ఆరిఫ్ అక్బర్ను గుర్తుతెలియని వ్యక్తులు కారులో తీసుకెళ్లారు. అదేవిధంగా దుకాణంలో ఉన్న రూ.లక్షల విలువైన కలపను దుండగులు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే కిడ్నాప్కి కారణమని భావిస్తున్నారు.