యావత్మల్, సెప్టెంబర్ 28: మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో వరద ప్రవాహంలో మంగళవారం ఓ బస్సు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన షేక్ సలీం అలియాస్ షేక్ ఇబ్రహీం (50) అనే వ్యక్తితో పాటు ముగ్గురు మరణించారు. మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన సెమీ లగ్జరీ బస్సు వరద నీటిలో మునిగిన బ్రిడ్జి పైనుంచి వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్తో పాటు నలుగురు ప్రయాణికులు ఉన్నారు. కండక్టర్తో పాటు ఒక ప్రయాణికుడిని రక్షించారు. డ్రైవర్ గల్లంతయ్యాడు.