శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో మారణాయుధాలు కలకలం సృష్టించాయి. సాంబా ఏరియాలో ఈ ఉదయం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అధికారులకు ఆ మారణాయుధాలు లభ్యమయ్యాయి. వాటిలో ఒక ఏకే-47 రైఫిల్ విత్ మ్యాగజైన్, ఒక 9 ఎంఎం పిస్తోల్ విత్ మ్యాగజైన్, 15 రౌండ్ల బుల్లెట్లు ఉన్నాయి. పాకిస్థాన్కు చెందిన ఓ డ్రోన్ వాటిని విడిచి వెళ్లినట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. దేశంలో అక్రమంగా చొరబడిన ఉగ్రవాదుల కోసం పాకిస్థాన్ డ్రోన్ల ద్వారా ఆయుధాలను జారవిడిచి ఉంటుందని అనుమానిస్తున్నారు.