కరోనా మహమ్మారి సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపుతోంది. కరోనా బారిన పడిన రచయిత నంద్యాల రవి శుక్రవారం మృతిచెందారు. గత కొన్ని రోజులుగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాసవిడిచారు. నేను సీతామహాలక్ష్మి, పందెం, అసాధ్యుడు, ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే చిత్రాలతో రచయితగా ప్రతిభను చాటుకున్నారాయన. దర్శకుడిగా ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. నంద్యాల రవికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మంచి రచయితను చిత్ర పరిశ్రమ కోల్పోయిందని పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.