హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం లాక్డౌన్ వలన ఇంటికే పరిమితమై ఉంది. ఖాళీ సమయంలో అభిమానులతో ముచ్చటిస్తూ నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇస్తుంది. తాజాగా అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ.. పుష్ప సెట్లో ఉన్న నాలుగు రోజులలోనే అతిని వ్యక్తిత్వానికి ఫిదా అయ్యాన. ఆయనకు పని పట్ల చాలా నిబద్ధత ఉంటుంది. అతడు బహుముఖ ప్రజ్ఞాశాలి . అతడు ఎన్ని సినిమాలు చేసినా ప్రతి సినిమాని మొదటి సినిమా అనుకుని శ్రమిస్తారు అని తెలిపింది అనసూయ.
పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర చూసి ప్రేక్షకులు పూనకం వచ్చిన్టు ఊగిపోవడం ఖాయమని ఆమె అంటున్నారు. సుకుమార్తో రెండో సారి కలిసి పని చేయడం సరదాగా ఉంటుంది. ఆర్టిస్టులతో ది బెస్ట్గా కలిసిపోతారు. సుకుమార్ సెట్స్లో ఉంటే ఆ ఎనర్జీనే వేరు అంటుంది అనసూయ. అయితే పుష్ప చిత్రంలో ఈ అమ్మడు ఏ పాత్ర పోషిస్తుందనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.కాగా, అనసూయ నటించిన థాంక్యూ బ్రదర్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.