మేడ్చల్ మల్కాజిగిరి : సీఎం రిలీఫ్ ఫండ్ కింద ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలనికార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గుర్రాల సునీతకు రూ.42,000వేలు, కీసరకు చెందిన ఎం.నవీన్కుమార్కు రూ.40,000వేలు, కీసరకు చెందిన శ్రీనివాస్కు రూ.40,000వేలు, కీసరకు చెందిన కర్రె నర్సింహకు రూ.22,000వేల చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కులను ఆదివారం మంత్రి ఆయన నివాసంలో వారికి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతోమందికి మేలు జరిగిందన్నారు. చాలా మంది అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకున్న వారందరికి ప్రభుత్వం తరుపున ఆర్థిక సహాయం చేసి అండగా ఉన్నామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఇవి కూడా చదవండి..
గాలి ద్వారా కరోనా చాలా ఆందోళనకరం: ఎయిమ్స్ చీఫ్
పెద్దపల్లి జిల్లాలో..కరోనాతో అటెండర్ మృతి
పేరు కోసమే విదేశాలకు కరోనా మెడిసిన్.. ప్రధాని మోదీపై మమత ఫైర్