తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి విజ్ఞప్తి
అంబర్పేట, జూన్ 20: రాష్ట్రంలో ఏదైనా ఒక జిల్లాకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టాలని తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పోచంపల్లి రమణరావు సీఎం కేసీఆర్కు విజ్ఞప్తిచేశారు. ఈ విషయమై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి, పీవీ శతజయంతి ఉత్సవ సమితి చైర్మన్ కే కేశవరావుకు వినతి పత్రాలు సమర్పించామని చెప్పారు. ఆదివారం ఆయన న్యూనల్లకుంటలో మీడియాతో మాట్లాడుతూ.. బ్రా హ్మణుల ఆర్థిక, సామాజిక, రాజకీయ అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎనలేని తోడ్పాటునందిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవులపల్లి రంగారావు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంత్రి సునీల్, జిల్లా ప్రచార కార్యదర్శి పురుషోత్తంరావు, జిల్లా కార్యదర్శి పీ లక్ష్మణ్రావు, కార్యవర్గసభ్యులు జీ సత్యప్రకాశ్రావు, గుండురాజు అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.