మహబూబ్నగర్ : టీఆర్ఎస్ పార్టతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని అనేక సంఘాలు పార్టీకి మద్దతునిచ్చాయని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి ప్రెస్ మీట్
నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..గత పది రోజులుగా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించాం.
ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాణీదేవికి సంపూర్ణ మద్దతు ప్రకటించారని తెలిపారు.
పట్టభద్రుల ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి గడపకు లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. మీరు ఆలోచించి ఓటు వేయాలన్నారు. విజ్ఞతతో విలువైన ఓటును వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఓటు వేసే విధానాన్ని డమ్మీ బ్యాలెట్ తో మంత్రి వివరించారు
.