యాదాద్రి, మార్చి16: అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్వన్గా నిలిచిందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి స్పష్టం చేశారు. ఆరే్ంల గా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరువయ్యాయని తెలిపారు. ఇంతటి అద్భుత పాలనను చూసి వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలో కాచారం సర్పంచ్, కాంగ్రెస్ సీనియ ర్ నాయకుడు కొండం అరుణాఅశోక్రెడ్డి నాయకత్వంలో మాజీ పాల సంఘం చైర్మన్లు, మాజీ ఎంపీటీసీ, సీనియర్ కాంగ్రెస్ నా యకులు, బాహుపేట గ్రామానికి చెందిన పాల సంఘం చైర్మన్ బుడిగే భిక్షపతి, డైరెక్టర్లు గీసె భాస్కర్, వార్డు సభ్యులు ఆరె బాల నర్సయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, మాసాయి పేట గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ మండల మాజీ అధ్యక్షు డు బర్ల శివయ్యతో కలిపి 300 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ మహేం దర్ రెడ్డి గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీలో పాత కొత్త అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ కలిసికట్టుగా పార్టీ అభివృద్ధికి సహ కరించాలని విజ్ఞప్తి చేశారు. కష్టపడ్డ వారికి గుర్తింపు ఉంటుంద న్నారు. యాదాద్రి అభివృద్ధితో సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచి పోవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ క మిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ మిట్ట వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్ రామిరెడ్డి, టీఆర్ఎస్ నా యకులు వంటేరు సురేశ్రెడ్డి, జిన్నా మాధవరెడ్డి, కవిడే మహేం దర్, చొప్పరి మధు, పాపట్ల నరహరి, సయ్యద్ సలీం, బుచ్చి రెడ్డి, బాల్రెడ్డి, మచ్చ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.