వనపర్తి, మే15 : రైతుల నుంచి ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టంచేశారు. వనపర్తి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, తరలింపుపై జడ్పీ చైర్మ న్ లాక్నాథ్రెడ్డి, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, అధికారుల తో శనివారం మం త్రి హైదరాబాద్ నుంచి టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. మిల్లర్లు అధికారుల సూచనలు పాటించాలని కోరారు. తూకం వేసిన తరువాత మిల్లర్లు ధాన్యం తరుగు తీస్తే మిల్లుల లైసెన్సులు రద్దు చేయాలని అధికారులకు సూచించారు.