ఆటపాటలతో చదువులు..
విద్యార్థుల్లో నైతిక విలువలపెంపునకు కృషి
ఎమ్మార్పీలకు పూర్తయిన శిక్షణ
రేపటి నుంచి 10వ తేదీ వరకుఉపాధ్యాయులకు..
వచ్చే విద్యా సంవత్సరం నుంచిపాఠశాలల్లో అమలు
నెల్లికుదురు, ఏప్రిల్ 4 : చిన్న పిల్లలకు కథలు, ఆటపాటలు, కృత్యాలతో బోధన అందిస్తే వారికి పాఠశాలకు వెళ్లాలనే ఆలోచన కలుగుతుంది. ఇవ్వాల ఏ కథ చెబుతారోనని ఆసక్తి పెరుగు తుంది. దీనికి తోడు వ్యక్తిత్వ వికా సాన్ని పెంపొందించేందుకు విలువలున్న బోధన అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘హరివిల్లు ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు ఆన్లైన్లో ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో దీనిని అమలు చేయనుంది. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఆట-పాట, కథలు, చిన్నచిన్న కృత్యాలపై మ క్కువ ఉంటుంది. వారికి అవే బోధిస్తే పాఠశాలకు వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తారు. ‘ఈ రోజు ఏం కథ చెబుతారోనని.. ఏం కృత్యం చేయిస్తారోనని ఉత్సాహంగా స్కూల్కు వెళ్తాం’ అనే ఆలోచనతో విద్యార్థులు నిద్రలేవాలనే లక్ష్యంతో నేపాల్, ఢిల్లీలో అమలవుతున్న ‘హరివిల్లు’ కార్యక్రమాన్ని ప్రభుత్వం మన రాష్ట్రంలో అమలు చేయనుం ది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా మహబూబాబాద్ జిల్లాలో చేపట్టి సత్ఫలితాలు సాధించింది.
హాజరు శాతం పెంపే లక్ష్యం..
ఉపాధ్యాయులకు హరివిల్లుపై శిక్షణ అందించిన తర్వాత నూతన విద్యా సంవత్సరంలో అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో దీనిని అమలు చేయనున్నారు. బడుల్లో హాజరుశాతం పడిపోకుండా 2021-22 విద్యా సంవత్సరంలో ‘హరివిల్లు-జాయ్ఫుల్ లర్నింగ్’ కార్యక్రమాన్ని విద్యాశాఖ అమలు చేయనున్నది.
బోధన షెడ్యూల్ ఇలా..
పాఠశాలల్లో విద్యార్థులను ఏ, బీ సెక్షన్లుగా విభజిస్తారు. ఏ సెక్షన్లో 1, 2, బీ సెక్షన్లో 3,4,5 తరగతుల వారికి బోధిస్తారు. సోమవారం మానసిక సంసిద్ధత, మంగళ, బుధవారాల్లో కథలు చెప్పడం, గురు, శుక్రవారాల్లో 1, 2 తరగతులకు సమన్వయ కృత్యా లు, 3, 4, 5 తరగతి పిల్లలకు భావ వ్యక్తీకరణ అంశాలపై బోధన అందించనున్నారు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానంపై అవగాహన కల్పిస్తారు.
శిక్షణ పొందిన 150 మంది రిసోర్స్ పర్సన్లు
ఈనెల 6 నుంచి 10వ వరకు హరివిల్లుపై ఉపాధ్యాయులకు ఆన్లైన్లో జూమ్ యాప్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 32 మంది, వరంగల్ రూరల్లో 32, వరంగల్ అర్బన్లో 22, ములుగులో 18, జనగామలో 24, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 22 మంది ఎమ్మార్పీలు ఈ కార్యక్రమంపై రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందారు. వీరు రోజుకు రెండు విడుతలుగా ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఒక బ్యాచ్కి, మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మరో బ్యాచ్ చొప్పున శిక్షణ పొందారు.
ఇవి కూడా చూడండి..
లవ్ ట్రాక్ గురించి చెప్పిన అంజలి
ప్రజాసేవ కోసం.. సినిమాలు వదిలేస్తా: కమల్ హాసన్