ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పటాన్చెరు, మే 11 : నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి కాంట్రాక్టర్లకు సూచించారు. పటాన్చెరు పట్టణంలోని కటికె బస్తీలో జరుగుతున్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు, సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకాలంలో సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూ చించారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ పటాన్చెరులో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, పారిశుధ్యం పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. వారి వెంట బాయ్కాడి హారిక విజయ్కుమార్, డీఈ వెంకటరమణ, ఏఈ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వం అండ
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి గుమ్మడిదల, మే 11 : టీఆర్ఎస్ కార్యకర్తలకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఇటీవల మండలంలోని కానుకుంట గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త తలారి ఆంజనేయులు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రమాద బీమా నుంచి మంజూరైన రూ.2 లక్షలను మంగళవారం మృతుడి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పార్టీ కార్యకర్తల ప్రమాద బీమా కల్పించి వారి కుటుంబాలకు అండగా నిలిచారని తెలిపారు. ప్రతి కార్యకర్తను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కుమార్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నరేందర్రెడ్డి, సీనియర్ నాయకులు విజయభాస్కర్రెడ్డి, వెంకటేశ్గౌడ్ ఉన్నారు.