నిరాడంబరంగా జరుపుకొన్న ‘టాక్’
హైదరాబాద్, జూలై 13(నమస్తే తెలంగాణ): తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల పండుగను నిరాడంబరంగా జరుపుకొన్నారు. స్థానిక ఆలయం లో మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి పూజలు నిర్వహించారు. టాక్ నేతలు సురేశ్, రత్నాకర్ కడుదుల, శుష్మనారెడ్డితోపాటు మల్లారెడ్డి, నవీన్రెడ్డి, వెంకట్రెడ్డి, స్వాతి, సుప్రజ, రాకేశ్ పటేల్, సత్యపాల్, హరిగౌడ్, గణేశ్ రవి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ఢిల్లీ తెలంగాణ భవన్లో ఘనంగా బోనాలు
రెండు రోజులపాటు జరగనున్న బోనాల ఉత్సవాలు మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ ముదిరాజ్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, లాల్దర్వాజ ఆలయ కమిటీ చైర్మన్ కే వెంకటేశ్, ఉపాధ్యక్షుడు శీరా రాజ్కుమార్, ప్రధాన కార్యదర్శి బీ మారుతీయాదవ్, కోశాధికారి జీ అరవింద్ కుమార్గౌడ్, కార్యనిర్వాహక కార్యదర్శి ఏ చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
23 నుంచి లాల్దర్వాజ బోనాలు
హైదరాబాద్ పాతబస్తీ లాల్దర్వాజ బోనాలను ఈనెల 23నుంచి ఆగస్టు 2వరకు నిర్వహించనున్నారు. ఎప్పటిలా ఒకేరోజు కాకుండా ఈసారి 15 రోజులపాటు భక్తులు బోనాలు సమర్పించుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. ఈనెల 18 నుంచి ఆగస్టు ఆరు వరకు భక్తులు బోనాలు సమర్పించవచ్చని ఆలయ కమిటీ చైర్మన్ కే వెంకటేశ్ వెల్లడించారు.