కరీమాబాద్, మే 11 : వరంగల్లోని కరీమాబాద్కు చెందిన దళితరత్న, తెలంగాణ మైనారిటీ కమిషన్ సభ్యుడు బొమ్మల్ల కట్టయ్య (75) మంగళవారం గుండెపోటులో మృతిచెందారు. కట్టయ్య రైల్వేలో హెడ్ క్లర్క్గా పనిచేసి 2016లో ఉద్యోగ విరమణ పొందారు. 2001లో అఖిలభారత దళిత సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ నుంచి అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు పొందారు. 2003లో ప్రభుత్వం నుంచి దళితరత్న అవార్డు అందుకున్నారు. 2006లో కాకతీయ యూనివర్సిటీ సెనేట్ మెంబర్గా నియమితులయ్యారు. అంబేద్కర్ సంఘాలను ఏర్పాటు చేశారు. బుద్దిస్టు సొసైటీ జాతీయ కార్యదర్శిగానూ పనిచేశారు. దళితుల సమస్యలపై అనేక పోరాటాలు చేశారు. కట్టయ్య మృతిపట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంతాపం తెలిపారు.