హైదరాబాద్ : రోడ్డుపై పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని గమనించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వెంటనే తన వాహనం నుంచి దిగి జగిత్యాల దవాఖానకు తరలించి తను ఉదారతను చాటుకున్నారు. మెట్ పల్లి, కథలాపూర్, మేడిపల్లిలలో ఆదివారం పలు కార్యక్రమాలలో పాల్గొని కరీంనగర్ వెళ్తుండగా వినోద్ కుమార్ కు ఈ సంఘటన ఎదురైంది.
జగిత్యాల నుంచి కరీంనగర్ వెళ్తున్న దారిలో మల్యాల్ ఎక్స్ రోడ్ లో గాయాలతో పడిపోయి ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని చూసి వెంటనే బోయినపల్లి వినోద్ కుమార్ వాహనాన్ని ఆపి ప్రత్యేక వాహనంలో జగిత్యాల దవాఖానకు తరలించారు. పోలీసులను అప్రమత్తం చేశారు. ఉదారతను చూపిన వినోద్ కుమార్ సేవల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
ఇవి కూడా చదవండి..
ఉపాధి కోసం వెళ్తూ..మృత్యు ఒడిలోకి
ఆకలికేకల తెలంగాణ అన్నపూర్ణగా మారింది
లాక్డౌన్తో కరోనా తగ్గుముఖం : స్పీకర్ పోచారం
రైతుల శ్రేయస్సే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం
అశ్విన్ ఆల్టైమ్ గ్రేట్స్లో ఒకడు కానే కాదు: మంజ్రేకర్
తాండ్రియాల్లో తక్షణమే ధాన్యాన్ని సేకరించాలి
పేదలకు భారం తగ్గించేందుకే డయాగ్నోస్టిక్ కేంద్రాలు