న్యూఢిల్లీ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలపై కరోనా నీలిమేఘాలు కమ్ముకున్నాయి. వచ్చే నెలలో జరుపతలపెట్టిన పోర్చుగల్, ఫ్రాన్స్ పర్యటనలు రద్దు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈయూ శిఖరాగ్ర సమావేశం వర్చువల్ జరిపేందుకు కసరత్తులు జరుగుతున్నాయి.
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారుతున్నది. ఇది ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై కూడా ప్రభావం చూపుతున్నది. వచ్చే నెలలో మోదీ ఫ్రాన్స్, పోర్చుగల్ పర్యటన ఇబ్బందుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతదేశంలో ప్రతిరోజూ రెండున్నర మిలియన్లకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ కారణంగా భారతదేశం నుంచి వచ్చే ప్రయాణికులను వివిధ దేశాలు నిషేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి విదేశీ పర్యటనపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని తెలుస్తున్నది.
ప్రధాని పర్యటన గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించనప్పటికీ సన్నాహాలు మాత్రం జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో వర్చువల్గా నిర్వహించే ఈయూ సదస్సులో మాత్రమే మోదీ పాల్గొనే అవకాశాలున్నాయి.
ఇప్పటికే షెడ్యూల్ చేసిన వివరాల ప్రకారం.. వచ్చే నెల 8 న ప్రధాని మోదీ పోర్చుగల్ పర్యటన చేపట్టి అక్కడి నుంచి ద్వైపాక్షిక చర్చల కోసం ఫ్రాన్స్ కూడా వెళ్తారు. అక్కడ ఫ్రెంచ్ అధ్యక్షుడితో భేటీ కానున్నారు. జూన్లో జీ 7 శిఖరాగ్ర సమావేశం సమయానికి పరిస్థితులు మెరుగుపడితేనే ప్రధాని మోదీ బ్రిటన్ను సందర్శించవచ్చు. జీ 7 లో బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ ఉన్నాయి.
ఇలాఉండగా, భారతదేశంలో కరోనా ఇన్ఫెక్షన్ పెరుగుతున్న నేపథ్యంలో బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన వాయిదా పడింది. ఇప్పుడు అతను కొన్ని రోజుల తరువాత భారతదేశానికి రావాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే బోరిస్ జాన్సన్ ఒకసారి భారత పర్యటన రద్దైంది.
డొమినోస్ 18 కోట్ల కస్టమర్ల డాటా లీక్
కరోనా ఎఫెక్ట్ : ఆక్సిజన్ కోసం రెండు రాష్ట్రాల తగువులాట..!
పిచ్బ్లెండ్ నుంచి రేడియం వేరుచేసిన మెర్క్యూరీ.. చరిత్రలో ఈరోజు
వచ్చే నెల మొదటి వారంలో కరోనా ఉధృతి : ఐఐటీ కాన్పూర్ అధ్యయనం
అక్టోబర్లో రానున్న జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’
బ్రిటన్లో లాక్డౌన్కు విశ్రాంతి.. జనంతో నిండిపోయిన రెస్టారెంట్లు
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..