చెన్నై: తమిళ స్టార్ కమెడియన్ వివేక్(59) గుండె సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. వివేక్ మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపం ప్రకటించారు. వివేక్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని తమిళనాడుకు చెందిన పలువురు భారత క్రికెటర్లు పేర్కొన్నారు. భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, పేసర్ టీ నటరాజన్, వికెట్ కీపర్ బ్యాట్స్మన్ దినేశ్ కార్తీక్ తదితరులు వివేక్ మృతికి సంతాపం తెలుపుతూ ట్వీట్లు చేశారు. వివేక్ మరణవార్త తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. 2009లో భారత నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో వివేక్ను భారత ప్రభుత్వం సత్కరించింది.