ఈ శుక్రవారం రెండు క్రేజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రానా దగ్గుబాటి, నితిన్ లాంటి ఇద్దరు యంగ్ హీరోలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు. వీళ్లు నటించిన సినిమాలు నువ్వా నేనా అన్నట్లు విడుదలయ్యాయి. అయితే భారత్ బంద్ కారణంగా చాలా చోట్ల ఈ రెండు సినిమాలకు ఊహించిన ఓపెనింగ్స్ రాలేదు. దానికితోడు పబ్లిక్ రెస్పాన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో థియేటర్ వరకు ఆడియన్స్ ను రప్పించేసరికి దర్శక నిర్మాతల తలప్రాణం తోకలోకి వస్తుంది. ఇదిలా ఉంటే నితిన్ నటించిన రంగ్ దే, రానా అరణ్య సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఊహించిన టాక్ అయితే రాలేదు.ఈ రెండు సినిమాలకు ఈ వారం నిరాశ తప్పేలా లేదు.
ముఖ్యంగా అరణ్య సినిమా ఒక మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఎడిటింగ్ లోపాలతో ఎటూ కాకుండా పోయింది. 2 గంటల 42 నిమిషాల సినిమాలో 40 నిమిషాలకు పైగా ఎడిట్ చేశారు. అయితే అది కరెక్ట్ గా చేయకపోవడంతో సినిమా అతుకుల బొంతలా మారిపోయిందని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.
మరో వైపు వెంకీ అట్లూరి తెరకెక్కించిన రంగ్ దే సినిమా కూడా జస్ట్ ఆవరేజ్ దగ్గరే ఆగిపోయింది అంటూ ప్రేక్షకులు చెబుతున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ కామెడీతో బాగానే వెళ్లిపోయినా కీలకమైన సెకండాఫ్ లో మాత్రం ఎమోషనల్ గా కనెక్ట్ కాలేకపోయింది. దానికి తోడు తొలిప్రేమ, మిస్టర్ మజ్ను ఛాయలు ఈ సినిమాలో కూడా కనిపించాయి. నితిన్, కీర్తి సురేష్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. దానికి తోడు కొన్ని కామెడీ సన్నివేశాలు బాగానే పేలాయి.
దాంతో అరణ్య సినిమాతో పోలిస్తే నితిన్ సినిమాకు కాస్త బెటర్ టాక్ వచ్చింది. అయితే ప్రేక్షకులు తమ వైపు తిప్పుకోవడానికి ఈ మాత్రం టాక్ సరిపోతుందా అనేది అతి పెద్ద అనుమానం. ఏదేమైనా కూడా ఈ శుక్రవారం రెండు సినిమాలు పూర్తి స్థాయిలో పాజిటివ్ టాక్ తెచ్చుకోలేకపోయాయి అనేది మాత్రం వాస్తవం. మరి వీటి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఎన్టీఆర్ సినిమా కోసం కమెడీయన్ను విలన్గా మారుస్తున్న త్రివిక్రమ్
కుమారుడితో నువ్వు నేను బ్యూటీ ఫన్ టైం- వీడియో వైరల్
విక్రమ్ వేధ హిందీ రీమేక్లో తలపడనున్న హృతిక్, సైఫ్!
సీనియర్ హీరోయిన్ తో ఎఫైర్ .. నిజనిజాలేంటో చెప్పిన కమెడీయన్
నితిన్ రంగ్ దే రివ్యూ.. టైమ్పాస్ ఎంటర్టైనర్
ఇండస్ట్రీలో మరో విషాదం.. సింగర్ మృతి