కంటోన్మెంట్, మే 1: నగరంలోని బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలకు కొరత ఏర్పడినందున.. యువత పెద్ద ఎత్తున ముందుకు వచ్చి రక్తం దానం చేసి.. ఇతరుల ప్రాణాలు కాపాడాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పిలుపునిచ్చారు. నార్త్జోన్ పరిధిలోని కార్ఖానా పోలీసులు, హైదరాబాద్ సిటీ పోలీసులతో కలిసి సంయుక్తంగా కార్ఖానలోని కేజేఆర్గార్డెన్స్లో శనివారం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని నార్త్జోన్ అడిషనల్ డీసీపీ మురళీధర్తో కలిసి సీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న క్రమంలో యువత రక్తదానానికి ముందుకు రావాలని కోరారు. కార్ఖాన సీఐ పరావస్తు మధుకర్స్వామి నేతృత్వంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేసి రక్తదానం చేయడం సంతోషదాయకమని ప్రశంసించారు. రక్తదానం చేసిన దాతలను సీపీ అభినందించి.. ధ్రువ పత్రాలు అంజేశారు. కార్యక్రమంలో ఏసీపీలు రమేశ్, నరేశ్రెడ్డి, గురునానక్ కళాశాల ఎండీ గగన్ నాన్ దీప్సింగ్ కోహ్లీ, ఎస్సైలు అవినాశ్బాబు, నారాయణ, నర్సింహ, ఏఎస్సైలు సరళ, దీప్కౌర్, కానిస్టేబుళ్లు ప్రీతి, భార్గవి, తరుణి, శంకర్నాయక్, ఈశ్వర్, రాజేశ్, రాకేశ్, నాగేశ్వర్రావు, వెంకటేశ్ పాల్గొన్నారు.